రాజకీయ ఫిరాయింపులు దారుణం: లోక్‌సత్తా | Recent Political Defections are ruthless says Loksatta | Sakshi
Sakshi News home page

రాజకీయ ఫిరాయింపులు దారుణం: లోక్‌సత్తా

May 15 2016 2:54 PM | Updated on Mar 9 2019 4:13 PM

రాష్ట్రంలో రాజధాని చుట్టూ రాజకీయం నడుస్తోందని లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు డీవీవీఎస్ వర్మ తెలిపారు.

విజయవాడ: రాష్ట్రంలో రాజధాని చుట్టూ రాజకీయం నడుస్తోందని లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు డీవీవీఎస్ వర్మ తెలిపారు. పరిపాలన పూర్తిగా స్తంభించిందన్నారు. ఆదివారం ఇక్కడ వర్మ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయ ఫిరాయింపులు దారుణమన్నారు.

ఎమ్మెల్యే రాజ్య వ్యవస్థను సీఎం చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారని... దాంతో ఎమ్మెల్యేలు కోట్లు సంపాదిస్తున్నారని దుయ్యబట్టారు. అందుకే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అధికారపక్షంలోకి ఫిరాయిస్తున్నారని అన్నారు. చంద్రబాబు సమర్థుడైతే తెలంగాణలో టీడీపీ నాయకులు టీఆర్‌ఎస్‌లోకి ఎందుకు ఫిరాయిస్తున్నారని ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement