చంద్రబాబును కలిసిన మాస్టర్ రవికర్‌ | ravikar met chandrababu naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబును కలిసిన మాస్టర్ రవికర్‌

Jun 18 2017 7:27 PM | Updated on Sep 5 2017 1:56 PM

ఇండో పాక్‌ బోర్డర్ లోని సరిహద్దులో భద్రత, ఇతర విషయాలను చూసి వచ్చిన మాస్టర్ రవికర్‌ ఆదివారం చంద్రబాబును కలిశాడు.

అమరావతి : ఇండో పాక్‌ బోర్డర్లోని సరిహద్దులో భద్రత, ఇతర విషయాలను చూసి వచ్చిన మాస్టర్ రవికర్, వారి తల్లిదండ్రులు నరసింహారెడ్డి, ఇందిరతో కలిసి ఆదివారం ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిశాడు. ఈ సందర్భంగా మాస్టర్ రవికర్ను చంద్రబాబు అభినందించారు. మహానాడులో పాల్గొనే అవకాశం కల్పించాలని రవికర్ కోరగా తదుపరి మహానాడులో పాల్గొనేందుకు అవకాశం ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

కాగా అయిదో తరగతి చదువుతున్న మాస్టర్ రవికర్ రెడ్డి సరిహద్దు భద్రతా సేవలను ప్రత్యక్షంగా చూడాలని బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్కు లేఖ రాయడంతో బీఎస్ఎఫ్ డీజీ కె.కె.శర్మ స్పందించి బోర్డర్లో మార్చి 21 నుంచి 26 వరకు పర్యటనకు అనుమతించారు. పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత రవికర్‌ సీఎంను కలిశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement