కోస్తాలో చెదురుమదురు వర్షాలు | Rains likely in Coastal Andhra Pradesh | Sakshi
Sakshi News home page

కోస్తాలో చెదురుమదురు వర్షాలు

Nov 8 2014 9:50 AM | Updated on Sep 2 2017 4:06 PM

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం శనివారం వెల్లడించింది.

విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం శనివారం వెల్లడించింది. విశాఖకు ఆగ్నేయంగా 510 కి.మీ దూరంలో కేంద్రీకృతమైందని తెలిపింది. ఈ సాయంత్రానికి వాయుగుండం బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో కోస్తాంధ్రలో చెదురుమదురుగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పింది. కోస్తాంధ్రలోని పోర్టుల్లో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందని వెల్లడించింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని మత్స్యకారులు వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement