'బాధలు చెప్పుకొచ్చిన రైల్వే మంత్రి' | Railway minister Sadananda Goud says Sufferings: DA Somayajulu | Sakshi
Sakshi News home page

'బాధలు చెప్పుకొచ్చిన రైల్వే మంత్రి'

Jul 8 2014 3:29 PM | Updated on Sep 2 2017 10:00 AM

సోమయాజులు

సోమయాజులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇరు రాష్ట్రాలకు కూడా రైల్వే బడ్జెట్లో ఎటువంటి స్పష్టమైన హామీ లభించలేదని వైఎస్‌ఆర్‌సీపీ సలహాదారు డి.ఎ.సోమయాజులు చెప్పారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇరు రాష్ట్రాలకు కూడా రైల్వే బడ్జెట్లో ఎటువంటి  స్పష్టమైన హామీ లభించలేదని వైఎస్‌ఆర్‌సీపీ సలహాదారు డి.ఎ.సోమయాజులు  చెప్పారు. రైల్వే మంత్రి సదానంద గౌడ తన ప్రసంగంలో కేవలం బాధలే చెప్పుకొచ్చారన్నారు. ప్రజలకేం చేస్తారో చెప్పలేదని,  రైల్వేబడ్జెట్ పూర్తి నిరాశ కల్గించిందని పేర్కొన్నారు.

ఏపీ పునర్విభజన బిల్లులో ప్రస్తావించిన అంశాలెక్కడా బడ్జెట్‌లో లేకపోవడం దురదృష్టకరం అన్నారు. రైల్వేలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ప్రైవేట్ భాగస్వామ్యమంటే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటని సోమయాజులు ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement