ప్రముఖ జర్నలిస్టు పాపయ్య శాస్త్రి మృతి | Probe the murder of a prominent journalist killed in Shastri | Sakshi
Sakshi News home page

ప్రముఖ జర్నలిస్టు పాపయ్య శాస్త్రి మృతి

Apr 19 2014 1:49 AM | Updated on Sep 28 2018 3:39 PM

ప్రముఖ జర్నలిస్టు పాపయ్య శాస్త్రి మృతి - Sakshi

ప్రముఖ జర్నలిస్టు పాపయ్య శాస్త్రి మృతి

సీనియర్ జర్నలిస్టు శివకోటి పాపయ్య శాస్త్రి(78) శుక్రవారం హైదరాబాద్‌లో కన్నుమూశారు.

 హైదరాబాద్,   సీనియర్ జర్నలిస్టు శివకోటి పాపయ్య శాస్త్రి(78) శుక్రవారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. 50 ఏళ్లకు పైగా పాత్రికేయ వృత్తిలో కొనసాగారు. 1955లో డెక్కన్ క్రానికల్ రిపోర్టర్‌గా, 1960-63 వరకు ఆంధ్రజ్యోతిలో సబ్ ఎడిటర్‌గా, 1964-66 గుంటూరులో ఆంధ్ర పత్రిక స్టాఫ్ రిపోర్టర్‌గా, 1967లో ఆంధ్రప్రభ స్టాఫ్ రిపోర్టర్‌గా, 1980-91 మధ్య ఆంధ్రప్రభ బ్యూరోచీఫ్‌గా, 1994-2004 మధ్య దూరదర్శన్‌లో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పనిచేశారు. శాస్త్రికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కాగా, శాస్త్రి అంత్యక్రియలు శనివారం సాయంత్రం జరపనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement