ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ రాష్ట్ర కార్యవర్గం | private electricals workers | Sakshi
Sakshi News home page

ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ రాష్ట్ర కార్యవర్గం

Apr 20 2015 2:58 AM | Updated on Sep 3 2017 12:32 AM

థానిక మాచవరంలోని విజయవాడ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ కార్యాలయంలో సంఘం రాష్ట్ర నూతన కార్యవర్గం ఆదివారం ఏకగ్రీవంగా ఎంపికైంది.

విజయవాడ : స్థానిక మాచవరంలోని విజయవాడ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ కార్యాలయంలో సంఘం రాష్ట్ర  నూతన కార్యవర్గం ఆదివారం ఏకగ్రీవంగా ఎంపికైంది. అధ్యక్షుడిగా టి.మోతీలాల్ రామ్‌ప్రసాద్ (గుంటూరు), ప్రధాన  కార్యదర్శిగా  శ్రీహరిరావు (విజయవాడ), కార్యదర్శిగా కె.పాల్‌రాజు (కర్నూలు), కోశాధికారిగా డి.వి.సత్యనారాయణ (విజయవాడ), ఉపాధ్యక్షులుగా ఆర్.వి.కష్ణకుమార్ (తూర్పుగోదావరి), నందగోపాల్ (తిరుపతి), సంయుక్త కార్యదర్శిగా మంతెన శ్రీనివాసరావు (శ్రీకాకుళం ), పి.వి.సత్యనారాయణ (పశ్చిమగోదావరి), పి.గురప్ప (కడప), ఎస్.కె.ఖాసిం (గుంటూరు) ఎంపికయ్యారు. గౌరవాధ్యక్షుడిగా మండవ కుటుంబరావు (విజయవాడ),  గౌరవ సలహాదారులుగా కె.శ్రీనివాసరావు, బి.రంగారావు, కార్యనిర్వాహక సభ్యులుగా ఎస్.రవిబాబు (గుంటూరు), దొడ్డి వెంకటేశ్వరరావు (విశాఖపట్నం), వై.శ్రీనివాసరావు (రాజమండ్రి), కె.దస్తగిరి (కడప), బి.సురేష్‌బాబు (కర్నూలు) ఎంపికయ్యారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement