తల్లికి తలకొరివి పెట్టిన మాజీ స్పీకర్‌ | Pratibha Bharati held Her Mother's Funeral At Srikakulam | Sakshi
Sakshi News home page

తల్లికి తలకొరివి పెట్టిన మాజీ స్పీకర్‌

Jun 20 2019 8:10 AM | Updated on Jun 20 2019 8:11 AM

Pratibha Bharati held Her Mother's Funeral At Srikakulam - Sakshi

మాజీ స్పీకర్‌ ప్రతిభా భారతి

సాక్షి, శ్రీకాకుళం : శాసనసభ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్‌ నాయకురాలు కావలి ప్రతిభా భారతి మాతృమూర్తి కొత్తపల్లి లీలావతమ్మ(85) అంత్యక్రియలు బుధవారం నిర్వహించారు. తల్లి పార్థివదేహానికి ప్రతిభా భారతి తలకొరివి పెట్టారు. మనుమరాలు గ్రీష్మాప్రసాద్, కుటుంబ పెద్దలు పాల్గొన్నారు. టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి(బాజ్జీ), రాష్ట్ర తూర్పుకాపు కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ కొళ్ల అప్పలనాయుడు, కేసరి తదితరులు ప్రతిభా భారతి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రతిభా భారతి 1999-2004 వరకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో స్పీకర్‌గా పనిచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement