మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారే లక్ష్యంగా పోలీసులు సోమవారం జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించారు.
చిత్తూరు: మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారే లక్ష్యంగా పోలీసులు సోమవారం జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మొత్తం 36 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించారు. పట్టుబడ్డ వారిపై కేసులు నమోదు చేసి కోర్టులో హజరుపరిచారు. కాగా, జిల్లా వ్యాప్తంగా చేపట్టిన ఈ తనిఖీల్లో ఎక్కువమంది యువకులే ఉన్నారని పోలీసులు తెలిపారు.