కుంచనపల్లిలో పందుల పోటీలు  | Pig Fight Competition In West Godavari | Sakshi
Sakshi News home page

కుంచనపల్లిలో పందుల పోటీలు 

Jan 17 2020 10:11 AM | Updated on Jan 17 2020 11:19 AM

Pig Fight Competition In West Godavari - Sakshi

కుంచనపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న పందుల పోటీ

తాడేపల్లిగూడెం రూరల్‌: సంక్రాంతి పేరు చెబితే మనకు ప్రధానంగా గుర్తుకొచ్చేది కోడిపందేలు. అయితే, మండలంలోని కుంచనపల్లి గ్రామంలో మాత్రం ఈ సంప్రదాయానికి భిన్నంగా పందుల పోటీలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఎస్టీ సంక్షేమ సంఘం నాయకులు సింగం పట్టాభి, సుబ్బారావు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ పోటీలు బుధవారం జరిగాయి. జిల్లాతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో పందుల పెంపకందారులు ఈ పోటీలకు తరలివచ్చారు.

కత్తులు కట్టకుండా ఎటువంటి జీవహింస లేకుండా ఈ పోటీలను నిర్వహిస్తున్నట్టు సింగం సుబ్బారావు తెలిపారు. పోటీ నుంచి పారిపోయిన పంది పరాజయం పొందినదిగా భావించి బరిలో నిలబడిన పంది విజయం సాధించినట్లుగా ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ పోటీల్లో ఎటువంటి జీవహింస లేదని, తమపై వన్యప్రాణి సంరక్షణ సమితి వారు కేసులు నమోదు చేయడం సరికాదని వివరించారు. పోటీలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement