* ‘రణభేరి’లో పీసీసీ చీఫ్ రఘువీరా ధ్వజం
* హామీలపై 8వ తేదీలోగా జవాబు చెప్పాలని డిమాండ్
రాజమండ్రి సిటీ: ఏడాది పాలనలో టీడీపీ, బీజేపీలు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రాష్ట్రప్రజలను మోసగించాయని పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి దుయ్యబట్టారు. టీడీపీ, బీజేపీల ఏడాది పాలనపై తూర్పుగోదావరి డీసీసీ అధ్యక్షుడు కందుల దుర్గేష్ అధ్యక్షతన శనివారమిక్కడి సుబ్రహ్మణ్య మైదానంలో కాంగ్రెస్ రణభేరి కార్యక్రమాన్ని నిర్వహించారు.
దీనిని రఘువీరారెడ్డి నగారా మోగించి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, 2018 నాటికి పోలవరం పూర్తి వంటి 600 వాగ్దానాలను ఎప్పటిలోగా అమలు చేస్తారో ఈనెల 8లోగా చెప్పాలని రఘువీరా కోరారు. లేనిపక్షంలో 9 నుంచి గడపగడపకూ వెళ్లి పాలకుల నిజస్వరూపాన్ని ఎండగడతామన్నారు. ప్రత్యేకహోదా విషయంలో చట్టం చేయాల్సిన పనిలేదని, ఏచట్టం చేయకుండానే 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను కాంగ్రెస్ సర్కారు ప్రకటించిందని ఆయన అన్నారు.
మోసం, దగాకోరు వాగ్దానాలతో అధికారంలోకొచ్చిన చంద్రబాబు ఇప్పుడు డ్రామాలాడుతున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.100 కోట్లిచ్చి.. గుజరాత్కు రూ.60 వేలకోట్లు మంజూరు చేయడమే మోదీ పాలనంటూ దుయ్యబట్టారు. రిలయన్స్ సంస్థకోసం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గకుండా చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో రాష్ట్ర మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, కేంద్ర మాజీమంత్రులు పళ్లంరాజు, కిల్లి కృపారాణి, జేడీ శీలంలతోపాటు కేవీపీ రామచంద్రరావు, కనుమూరి బాపిరాజు, ఏఐసీసీ ఎస్సీసెల్ చైర్మన్ కె.రాజు తదితరులు పాల్గొన్నారు.
8న టీడీపీ మేనిఫెస్టోలను దహనం చేయండి
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ఏడాది నయవంచక పాలనకు నిరసనగా ఈ నెల 8న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కాపీలను దహనం చేయాలని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఏడాది పాలనలో వైఫల్యాలతోపాటు విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావలసిన ప్రయోజనాలను సాధించడంలో విఫలమైన తీరును ఎక్కడికక్కడ ప్రజలకు వివరించనున్నట్లు ఆయన మీడియాకు విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా 8న నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పార్టీ యువజన, ఎన్ఎస్యూఐ, వివిధ అనుబంధ విభాగాల వారితో పాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు.
ప్రజల్ని మోసగించిన టీడీపీ, బీజేపీ
Published Sun, Jun 7 2015 2:08 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
ధోని నా తండ్రి లాంటి వారు: ‘బేబీ మలింగ’ కామెంట్స్ వైరల్
వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి
మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
ఏడాది తర్వాత ఓటీటీలోకి హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఆ సమస్యతో చాలా బాధపడ్డా, కానీ అదే కాపాడింది : సారా టెండూల్కర్
సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
బెంగాల్ గవర్నర్పై ఆరోపణలు: విచారణ జరపాలన్న మిసా భారతి
డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు
Pooja Hegde: రెడ్ డ్రెస్సులో అగ్గి రాజేస్తున్న బుట్టబొమ్మ (ఫోటోలు)
తప్పక చదవండి
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- Hindupur: కుచ్చుటోపీ చుట్టాలొచ్చారోచ్! ఉండండి టోపీ పెడతాం...
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
Advertisement