డీసీసీ బ్యాంక్లో జరిగిన అవకతవకలకు సంబంధించిన కేసులో పురోగతి కనిపిస్తోంది
పార్వతీపురం : డీసీసీ బ్యాంక్లో జరిగిన అవకతవకలకు సంబంధించిన కేసులో పురోగతి కనిపిస్తోంది. తాజాగా సోమవారం ఈ కేసును దర్యాప్తు చేయడానికి సీఐడీ అధికారులు రంగంలోకి దిగారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలోని డీసీసీబీ, పీఏసీఎస్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. గతంలో డీసీసీ బ్యాంక్ కు సంబంధించి రూ. 9 కోట్ల కుంభకోణం జరిగినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.