కోల్యార్డులతో దుమ్ము, ధూళి రావ డం, ప్రజల అవస్థలు, ధ్వంసమవుతున్న పర్యావరణం, పంటలపై ప్రభావాన్ని ‘సాక్షి’ దినపత్రిక ఈనెల 9న ‘బతుకు బొగ్గు’ శీర్షిక కథనాన్ని ప్రచురించింది.
తాండూర్, న్యూస్లైన్: కోల్యార్డులతో దుమ్ము, ధూళి రావ డం, ప్రజల అవస్థలు, ధ్వంసమవుతున్న పర్యావరణం, పంటలపై ప్రభావాన్ని ‘సాక్షి’ దినపత్రిక ఈనెల 9న ‘బతుకు బొగ్గు’ శీర్షిక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనాల క్లిప్పింగ్లను సదరు గ్రామాల ప్రజలు సబ్ కలెక్టర్ ప్రశాంత్ పాటిల్కు చూపించారు. ఆయన స్పందించారు. తాండూర్ మండలం బోయపల్లిలోని గుప్తా, అన్నవేణి శ్రీనివాస్, శ్రీనివాస్ గౌడ్, రఘువీర్, నరేష్ గుప్తా కోల్యార్డు యాజమాన్యాలకు ప్రశాంత్పాటిల్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వీరితోపాటు ఏరియా సింగరేణి జీఎం, దక్షిణ మధ్య రైల్వే అడిషనల్ డివిజన్ మేనేజర్కు షోకాజ్ నోటీసులు వెళ్లాయి. వీరందరూ కూడా ఈ నెల 31న ఆసిఫాబాద్ సబ్కలెక్టర్ కార్యాలయంలోని సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ముందు హా జరై వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులో ఆదేశించారు.