'అసెంబ్లీ ప్రొరోగ్ అంశాన్ని వివాదం చేయడం సరికాదు' | no need to controversy of prorogue assembly, says yadav reddy | Sakshi
Sakshi News home page

'అసెంబ్లీ ప్రొరోగ్ అంశాన్ని వివాదం చేయడం సరికాదు'

Nov 26 2013 4:16 PM | Updated on Sep 2 2017 1:00 AM

అసెంబ్లీ ప్రోరోగ్ అంశాన్ని వివాదం చేయడం సరికాదని ఎమ్మెల్సీ యాదవరెడ్డి తెలిపారు.

హైదరాబాద్: అసెంబ్లీ ప్రోరోగ్ అంశాన్ని వివాదం చేయడం సరికాదని ఎమ్మెల్సీ యాదవరెడ్డి తెలిపారు. తెలంగాణ మంత్రులు ప్రోరోగ్ చేయవద్దని గవర్నర్ను కలవడం సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన ప్రోరోగ్ వివాదం చేయవద్దని తెలంగాణ మంత్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ అంశానికి బదులు కేబినెట్ సమావేశం పెట్టాలని సీఎం కిరణ్ ను డిమాండ్ చేసి ఉంటే బాగుండేదన్నారు.

 

రాష్ట్ర విభజన అంశానికి సంబంధించి అసెంబ్లీని ప్రోరోగ్ చేయాల్సిన అవసరం లేదని మంత్రి శ్రీధర్ బాబు సోమవారం తెలిపిన సంగతి తెలిసిందే.   అసెంబ్లీ సమావేశం కావడానికి ఇప్పటికిప్పుడు కొంపలు మునిగే ఆర్డినెన్స్ లు ఏమీ లేవని ఆయన అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement