ఏపీఎన్జీవోల సమ్మెలో స్పష్టత లేదు | no clarity in apngo's strike, says devi prasad | Sakshi
Sakshi News home page

ఏపీఎన్జీవోల సమ్మెలో స్పష్టత లేదు

Sep 29 2013 4:29 PM | Updated on Sep 1 2017 11:10 PM

సీమాంధ్రలో గత రెండు మాసాలనుంచి సమ్మెతో ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్న ఏపీఎన్జీవోల పై టీఎన్జీవో నేత దేవీ ప్రసాద్ మండిపడ్డారు.

హైదరాబాద్ :సీమాంధ్రలో గత రెండు మాసాలనుంచి సమ్మెతో ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్న ఏపీఎన్జీవోల పై టీఎన్జీవో నేత దేవీ ప్రసాద్ మండిపడ్డారు. అక్కడ చేస్తున్న సమ్మెలో స్పష్టత కనిపించడం లేదని ఆయన విమర్శించారు. హైదరాబాద్ లో నిజాంకళాశాలలో నిర్వహిస్తున్న సకలజన భేరీ సభలో దేవీ ప్రసాద్ మాట్లాడారు. ఏపీఎన్జీవోలు ఎందుకు ఉద్యమం చేస్తున్నారో తెలియడం లేదన్నారు.

 

హైద్రాబాద్‌ నిజాం కళాశాలలో నిర్వహిస్తున్న సకల జన భేరి సభకు మండలంలోని జగదేవ్‌పూర్‌, మునిగడప, ఎరవ్రల్లి, గొల్లపల్లి, తిగుల్‌, చాట్లపల్లి , పిర్లపల్లి తదితర గ్రామాల నుండి తెలంగాణ వాదులు ఆదివారం భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మండల జేఏసీ ఆధ్వర్యంలో బస్‌లు, సుమోలను ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయ ,విద్యుత్‌ రంగ కార్మికులు ,విద్యార్థి సంఘాల నాయకులు ప్రజలను భారీగా తరలించారు. ఈ సభకు వెళ్లిన వారిలో జేఎసీ నాయకులు తుమ్మ కృష్ణ, విద్యుత్‌ రంగ కార్మికులు మల్లారెడ్డి, మధు, కృష్ణ, తెలంగాణ వాదులు భిక్షపతి, డి. కృష్ణ, బింగి బాస్కర్‌, అప్పల ప్రవీణ్‌ తదితరులు బయిల్దేరి వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement