తొమ్మిది మంది విద్యార్థులపై ర్యాగింగ్ కేసు | nine students booked on ragging charge | Sakshi
Sakshi News home page

తొమ్మిది మంది విద్యార్థులపై ర్యాగింగ్ కేసు

Jun 29 2014 10:54 PM | Updated on Sep 2 2017 9:34 AM

తొమ్మిది మంది విద్యార్థులపై పేట్ బషీరాబాద్ పోలీసులు ర్యాగింగ్ కేసు నమోదు చేశారు.

హైదరాబాద్: తొమ్మిది మంది విద్యార్థులపై పేట్ బషీరాబాద్ పోలీసులు ర్యాగింగ్ కేసు నమోదు చేశారు. వీరిలో ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించగా మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. పోలీసుల కథనం మేరకు..

కొంపల్లి సినీప్లానెట్ సమీపంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఫస్ట్ ఇయర్ ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థిని చొక్కా గుండి పెట్టుకోలేదని ఈ నెల 26న సీనియర్ విద్యార్థులు తొమ్మిదిమంది ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. అదే రోజు రాత్రి 12 సమయంలో ఎదురు తిరిగిన జూనియర్ విద్యార్థిపై వారు దాడికి పాల్పడ్డారు. ఈ విషయంపై పోలీసులు విచారణ జరిపి తొమ్మిది మంది విద్యార్థులపై ర్యాగింగ్ కేసు నమోదు చేశారు. వీరిలో ఏడుగురిని ఆదివారం అరెస్టు చేసి మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement