నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (ఎన్ఐడీఎం) దక్షిణ భారత క్యాంపస్ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది.
అయితే దీనికి కేటాయించిన భూమిని ప్రభుత్వం వెనక్కు తీసుకోవడంతో ఎన్ఐడీఎం ఏర్పాటులో జాప్యం అనివార్యమైంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా జిల్లా కొండపావులూరులో ఎన్ఐడీఎంకు స్థలం కేటాయించింది. దీనిని పరిశీలించిన ఎన్ఐడీఎం ప్రతినిధులు ఇక్కడ కేంద్రం ఏర్పాటుకు సమ్మతించారు. 12 రాష్ట్రాల విపత్తు నిర్వహణ సంస్థలకు ఇది సేవలందించనుంది. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ, రాష్ట్ర విపత్తు సహాయక దళాలకు ఇది ఎంతో ఉపయోగపడనుంది. కొండపావులూరులో ఎన్ఐడీఎం ఏర్పాటుకు ఆ సంస్థ ప్రతినిధులు అంగీకరించారని, త్వరలో నిర్మాణ పనులు చేపట్టనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. 2016 – 17 బడ్జెట్లోనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్ఐడీఎం ఏర్పాటుకు రూ.20 కోట్లు కేటాయించింది.