రఘువీరాపై నేదురుమల్లి కుమారుడు ఆగ్రహం | Nedurumalli Janardhana reddy son ramkumar reddy is angry at raghuveera reddy | Sakshi
Sakshi News home page

రఘువీరాపై నేదురుమల్లి కుమారుడు ఆగ్రహం

Nov 6 2014 1:44 PM | Updated on Sep 2 2017 3:59 PM

ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డిపై మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధనరెడ్డి కుమారుడు రాంకుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

నెల్లూరు : ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డిపై మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధనరెడ్డి కుమారుడు రాంకుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులో ఇందిరా భవన్ను డీసీసీకి అప్పగించటంపై ఆయన అభ్యంతరం తెలిపారు. కాంగ్రెస్ సమావేశంలో నేదురుమల్లికి నివాళులు అర్పించకపోవటం బాధాకరమని రాంకుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నేదురుమల్లి హయాంలో ఏర్పాటు చేసిన ఇందిరా భవన్పై ట్రస్టీకి పూర్తి హక్కులు ఉంటాయన్నారు. సోనియాను కలిసిన తర్వాతే ఇందిరా భవన్పై స్పష్టత ఇస్తామని ఆయన తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement