స్పీకర్ ఛాంబర్ వద్ద ఎమ్మెల్యేల భైఠాయింపు | MLAs protest outside Speaker's Nadendla manohar chamber | Sakshi
Sakshi News home page

స్పీకర్ ఛాంబర్ వద్ద ఎమ్మెల్యేల భైఠాయింపు

Dec 16 2013 1:24 PM | Updated on Aug 18 2018 4:13 PM

తెలంగాణ ప్రాంత కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సోమవారం స్పీకర్ ఛాంబర్ ఎదుట బైఠాయించారు.

హైదరాబాద్ : తెలంగాణ ప్రాంత కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సోమవారం స్పీకర్ ఛాంబర్ ఎదుట బైఠాయించారు. తక్షణమే బీఏసీ ఏర్పాటు చేసి బిల్లుపై చర్చ జరపాలంటూ డిమాండ్ చేశారు. విభజన బిల్లుకు సహకరించాలని వారు నినాదాలు చేశారు.

మరోవైపు బిల్లును సభలో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ సీమాంధ్ర ప్రాంత టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. కాగా సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు... స్పీకర్పై అవిశ్వాస తీర్మానం పెట్టే యోచనలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement