
తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్పం పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ అప్పలాయగుంట ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద నగరి ఎమ్మెల్యే ఆర్కేరోజా బుధవారం 1008 కొబ్బరి కాయలు కొట్టారు. ప్రజాక్షేమం కోరే జగన్కు ఆశీస్సులివ్వాలని వెంకన్నను ప్రార్ధించినట్లు చెప్పారు.