గల్లంతైన యువకుని మృతదేహం లభ్యం | Missing young man body found | Sakshi
Sakshi News home page

గల్లంతైన యువకుని మృతదేహం లభ్యం

Dec 14 2015 10:23 AM | Updated on Jun 1 2018 8:39 PM

అనంతపురం జిల్లా పుట్లూరు సమీపంలోని సుబ్బరాయసాగర్‌లో సోమవారం ఉదయం షాహిద్‌బాషా(22) అనే యువకుని మృతదేహం లభ్యమైంది.

అనంతపురం జిల్లా పుట్లూరు సమీపంలోని సుబ్బరాయసాగర్‌లో సోమవారం ఉదయం షాహిద్‌బాషా(22) అనే యువకుని మృతదేహం లభ్యమైంది. తాడిపత్రికి చెందిన రహంతుల్లా కుమారుడైన షాహిద్‌బాషా ఆరుగురు స్నేహితులతో కలిసి ఆదివారం సాయంత్రం సుబ్బరాయసాగర్‌లో ఈత కొట్టేందుకు వచ్చాడు.

లోతుకు వెళ్లిన షాహిద్ బాషా సాగర్‌లో మునిగి గల్లంతయ్యాడు. ఆదివారం సాయంత్రం గాలించినా మృతదేహం దొరకలేదు. సోమవారం ఉదయం నీటిలో తేలింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement