మిల్లర్లు ధాన్యం​ కొనుగోలు చేసేలా చర్యలు | Minister Kannababu Reacts on Rice millers distress sale of paddy | Sakshi
Sakshi News home page

మిల్లర్లు ధాన్యం​ కొనుగోలు చేసేలా చర్యలు

Dec 15 2019 5:27 PM | Updated on Dec 15 2019 7:41 PM

Minister Kannababu Reacts on Rice millers distress sale of paddy - Sakshi

సాక్షి, కాకినాడ: రేపటి నుంచి మిల్లర్లు అందరూ ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఆయన ఆదివారమిక్కడ మాట్లాడుతూ.. ధాన్యంతో పాటు పత్తి, వేరుశెనగ, మినుములు, పెసలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కొన్నిచోట్ల మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు తమ దృష్టికి తీసుకు వచ్చారన్నారు. వచ్చే నాలుగైదు రోజుల్లో కొనుగోలుకు సంబంధించి స్పష్టమైన ప్రకటన చేయబోతున్నామని మంత్రి కన్నబాబు తెలిపారు. ప్రభుత‍్వమే మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారన్నారు. కనీస మద్దతు ధర తగ్గితే ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారని ఆయన తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement