గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ పదవులకు ఇకమీదట పోటీ చేయాలనుకునేవారు కనీసం టెన్త్ పాసవ్వాల్సిందే.
హర్యానా తదితర కొన్ని రాష్ట్రాల్లో కనీస విద్యార్హత ఉండడం వల్ల.. స్థానిక పాలన మెరుగ్గా ఉందని అధ్యయనం చేసిన లోక్సభ అంచనాల కమిటీ.. దేశవ్యాప్తంగా కనీస విద్యార్హత ఉండాలని ప్రతిపాదిస్తూ కేంద్రానికి నివేదిక అందజేసింది. దీనిపై కేంద్రం లేఖ రాసింది.దీని పట్ల సానుకూలత వ్యక్తం చేసిన చంద్రబాబు సర్కారు పంచాయతీరాజ్ కమిషనర్ నుంచి నివేదిక కోరింది. ఆ నివేదిక అమల్లోకి వస్తే వచ్చే ఏడాది ఆగస్టు తర్వాత ఎప్పుడైనా జరిగే పంచాయతీ ఎన్నికల్లోనే ఈ నిబంధన అమలుకు రానుంది.