మధ్యాహ్న భోజనం ఇంత అధ్వానమా..? | Midday Meal Scheme Delayed in Vizianagaram | Sakshi
Sakshi News home page

మధ్యాహ్న భోజనం ఇంత అధ్వానమా..?

Jan 10 2019 8:38 AM | Updated on Jan 10 2019 8:38 AM

Midday Meal Scheme Delayed in Vizianagaram - Sakshi

కుళ్లిన గుడ్డు

విజయనగరం టౌన్‌: మధ్యాహ్న భోజన పరిస్థితి మరీ అధ్వానంగా తయారైందని చైల్డ్‌ రైట్స్‌ ప్రొటక్షన్‌ ఫోరమ్‌ జిల్లా అధ్యక్షుడు ఎస్‌.అచ్చిరెడ్డి అన్నారు. మలిచర్ల పంచాయతీ పరిధిలో చెల్లూరు ఎంపీయూపీ స్కూల్‌ను బుధవారం ఫోరమ్‌ ప్రతినిధులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించగా.. గట్టిగా ఉన్న అన్నం.. నీరులా ఉన్న సాంబారు..కుళ్లిన గడ్లు దర్శనమిచ్చాయి. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మాట్లాడుతూ, విద్యార్థులకు ఇలాంటి భోజనం పెడతారా అంటూ ప్రశ్నించారు. గుడ్లు పూర్తిగా కుళ్లిపోయి ఉండడవంతో విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. వారం రోజుల్లో మార్పు రాకపోతే అన్ని విద్యార్థి సంఘాలతో కలిసిపోరాటం చేస్తామని హెచ్చరించారు.  కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు చంద్రిక, సంతోష్, రాము, స్వామి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement