వివాహిత ఆత్మహత్య | Married Woman Commits Suicide | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్య

Sep 7 2018 7:38 AM | Updated on Nov 6 2018 8:08 PM

Married Woman Commits Suicide - Sakshi

అనూష (ఫైల్‌)

విశాఖపట్నం, గొలుగొండ: తండ్రి మందలించాడని మనస్తాపానికి గురైన వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. చోద్యం గ్రామంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి కృష్ణదేవిపేట ఎస్‌ఐ రమేష్‌ అందించిన వివరాలిలావున్నాయి. చోద్యం గ్రామానికి చెందిన శ్రీపాద అనూష(24) గత ఏడాది శ్రీపాద సత్యన్నారాయణతో వివాహం అయ్యింది. భర్తతో పాటు అనూష తల్లిదండ్రులు చోద్యంలో నివాసం ఉంటున్నారు. అనూష తండ్రి కామేశ్వర శర్మ ఇంట్లోని చెవిదుద్దులు తీసుకువెళ్లారు.

వాటిని తిరిగి తీసుకురాకపోవడంతో  అనూషకు ఆయనకు మధ్య గొడవ జరిగింది.  కాసేపటికి అంతా సద్దుమణిగింది. తరువాత అర్ధరాత్రి సమయంలో అనూష ఇంట్లో ఉన్న కిరోసిన్‌ ఒంటిపై వేసుకొని నిప్పంటుచుకుని ఆత్మహత్యకు పాల్పడింది.కుటుంబ సభ్యులు మంటలు అర్పినా ప్రయోజనం లేకపోయింది.  శరీరం కాలిపోవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనూష భర్త  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement