మనస్థాపంతో ఒకరి ఆత్మహత్య ? | man suicide in Garugubilli | Sakshi
Sakshi News home page

మనస్థాపంతో ఒకరి ఆత్మహత్య ?

May 15 2016 1:02 AM | Updated on Nov 6 2018 7:56 PM

కుటుంబ కలహాలతో ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు,


 గరుగుబిల్లి : కుటుంబ కలహాలతో ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  పోలీసులు, స్థానికులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని వల్లరగుడబ గ్రామానికి చెందిన ఆకుల బాపిరాజు (35) ఇంటిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృ తి చెందాడు. మృతుడికి పదేళ్ల కిందట శ్రీకాకు ళం జిల్లా మడపాం గ్రామానికి చెందిన సోములమ్మతో వివాహం జరిగింది.
 
 వీరికి ఇద్దరు కు మారులున్నారు. అయితే ఐదేళ్లుగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నారుు. ఈ క్రమంలో  సోములమ్మ బిడ్డలను తీసుకొని కన్నవారి ఇంటికి వెళ్లిపోయింది. కొద్ది రోజుల తర్వా త భర్తపై నరసన్నపేట కోర్టులో కేసు వేసింది. ఇదిలా ఉంటే బాపిరాజు బతుకుదెరు వు కోసం చెన్నై వెళ్లిపోయూడు. ఈ ఏడాది జనవరిలో గ్రామానికి రాగా, భార్య పెట్టిన కేసులో భాగం గా పోలీసులు అరెస్ట్ చేశారు.
 
 దీంతో రెండు నెలల పాటు జైలులో ఉన్న బాపిరాజు అనంతరం గ్రామానికి చేరుకున్నాడు. గురువారం కూడా గ్రామంలో కనిపించిన బాపిరాజు తర్వాత కనిపించకుండా పోయూడు. శనివారం నాటికి బాపిరాజు ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇ చ్చారు. ఎస్సై లోవరాజు సిబ్బందితో కలిసి గ్రా మానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పార్వతీపురం ఏరియూ ఆస్పత్రికి తరలిం చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement