నేటి ముఖ్యాంశాలు.. | Major Events On 27th May 2020 | Sakshi
Sakshi News home page

నేటి ముఖ్యాంశాలు..

May 27 2020 6:47 AM | Updated on May 29 2020 6:58 AM

Major Events On 27th May 2020 - Sakshi

ఆంధ్రప్రదేశ్‌
► ‘మన పాలన - మీ సూచన’ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు విద్యారంగంపై సదస్సు నిర్వహించనున్నారు. విద్యారంగంలో ఏడాది కాలంలో చేపట్టిన కార్యక్రమాలు, వాటి అమలు తీరు.. తదితర అంశాలపై ఈ సదుస్సులో చర్చించనున్నారు.

తెలంగాణ
► నేడు కీలక అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష నిర్వహించనున్నారు. కరోనా వ్యాప్తి, ఆంక్షల ఎత్తివేత, రాత్రిపూట కర్ఫ్యూపై ఈ సందర్భంగా చర్చించనున్నారు. రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణ తీరుపై దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంపై స్పష్టతినిచ్చే అవకాశం కనిపిస్తోంది. 

► రాష్ట్రంలో ఎంసెట్‌, ఈసెట్‌ తదితర ఉమ్మడి ప్రవేశ పరీక్షల దరఖాస్తుల గడువును ఈ నెల 31 నుంచి జూన్‌ 10 వరకు పొడిగించారు. 

జాతీయం 
► వచ్చే 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించనున్నాయి. రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం అండమాన్‌ సముద్రం, దానిని అనుకుని ఉన్న బంగాళాఖాతం మధ్య ప్రాంతాలకు విస్తరిస్తున్నాయని వాతావరణ నిపుణులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement