లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు | lorry, bus collided in guntur district four injured | Sakshi
Sakshi News home page

లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

Apr 17 2016 9:55 AM | Updated on Aug 24 2018 2:36 PM

గుంటూరు జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డుప్రమాదంలో నలుగురు గాయపడ్డారు.

గుంటూరు: గుంటూరు జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డుప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. రొంపిచెర్ల మండలం ఇప్పన్న గ్రామ శివారులోని అద్దంకి-నార్కెట్‌పల్లి జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు లారీని ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది.

ముందు వెళుతున్న లారీని వెనుక వేగంగా వచ్చిన వెంకటగిరి డిపోకు చెందిన సూపర్‌లగ్జరీ బస్సు ఢీకొట్టింది. ఈ సంఘటనలో బస్సులోని నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. దీంతో ప్రయాణికులను మరో బస్సులో గమ్యానికి చేర్చారు. క్షతగాత్రులకు రొంపిచెర్ల ప్రభుత్వాస్పత్రిలో ప్రాధమిక చికిత్స అందించారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement