
లాడ్జి కేంద్రంగా ఇన్పుట్ సబ్సిడీ జాబితా
పట్టణంలోని గోపివిహార్ లాడ్జి కేంద్రంగా ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ జాబితాను అధికారులు సిద్ధం చేయడం సంచలనం రేపింది.
పులివెందుల/రూరల్/తొండూరు: పట్టణంలోని గోపివిహార్ లాడ్జి కేంద్రంగా ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ జాబితాను అధికారులు సిద్ధం చేయడం సంచలనం రేపింది. ఈనెల 18నుంచి లాడ్జిలో తొండూరు మండల వ్యవసాయ శాఖ అధికారి కిశోర్ నాయక్, రెవెన్యూ కార్యదర్శులతోపాటు అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు సంయుక్తంగా జాబితాను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు.
అధికార పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు పంటను సాగు చేయకుండా ఉన్న వారి పేర్లను నమోదు చేస్తున్నట్లు తెలుస్తోంది. లాడ్జిలో గదిని వ్యవసాయ శాఖాధికారి కిశోర్ నాయక్, తొండూరు వీఆర్వో హరినాథరెడ్డిల పేర్లతో బుక్ చేసుకున్నట్లు లాడ్జి రికార్డులలో నమోదైంది. ఈ వ్యవహారంపై తొండూరు ఏవో కిశోర్ నాయక్ను అడగగా.. రాయచోటిలో నివాసముంటూ తొండూరులో విధులు నిర్వహిస్తున్నా... ఇన్ఫుట్ సబ్సిడీ జాబితాను రూపొందించడానికి పులివెందులలో లాడ్జిని తీసుకున్నానని చెప్పారు.
మీడియా వెళ్లడంతో పరుగులెత్తిన అధికారులు :
గత నాలుగు రోజులనుంచి తొండూరు మండల ఖరీఫ్ ఇన్ఫుట్ సబ్సిడీకి సంబంధించిన జాబితాను సిద్ధం చేస్తున్న విషయం తెలుసుకుని అక్కడకు మీడియా ప్రతినిధులు వెళ్లగా వారిని చూసి అధికారులు లాడ్జి నుంచి పరుగులు తీశారు.