జంట హత్యల కేసులో 9 మందికి జీవితఖైదు | life prisonment for 9 members in pair murders | Sakshi
Sakshi News home page

జంట హత్యల కేసులో 9 మందికి జీవితఖైదు

Aug 7 2015 5:49 PM | Updated on Mar 23 2019 7:54 PM

జంట హత్యల కేసులో మార్కాపురం జిల్లా ఆరో అదనపు న్యాయస్థానంతొమ్మిది మందికి జీవితఖైదు విధించింది.

ప్రకాశం(మార్కాపురం): జంట హత్యల కేసులో మార్కాపురం జిల్లా ఆరో అదనపు న్యాయస్థానంతొమ్మిది మందికి జీవితఖైదు విధించింది. వివరాలు.. మార్కాపురం మండలం అమ్మవారిపల్లి గ్రామంలోఆస్తి తగాదాల నేపధ్యంలో 2010, డిసెంబర్ 28న కురుకుంద శ్రీనివాసులు, కురుకుంద చిన్నవెంకటయ్య అనే ఇద్దరు వ్యక్తులను దారుణంగా బంధువులే హతమార్చారు. హత్య అనంతరం ఈ కేసుకి సంబంధించి తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. నాలుగున్నరేళ్ల అనంతరం వీరికి శిక్ష విధించారు. శిక్షపడిన వారిలో నలుగురు మహిళలు కూడా ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement