అనంతలో ప్రత్యేక హోదా కోసం దీక్ష | left parties Inmates for special status in anantapur | Sakshi
Sakshi News home page

అనంతలో ప్రత్యేక హోదా కోసం దీక్ష

May 8 2016 11:34 AM | Updated on Mar 23 2019 9:10 PM

ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోరుతూ ఉభయ కమ్యూనిస్ట్ పార్టీ నేతలు నిరవధిక దీక్షకు దిగారు.

అనంతపురం: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోరుతూ ప్రత్యేకహోదా సాధన సమితి నేతృత్వంలో నిరవధిక దీక్షలు చేపట్టారు. ఆదివారం ఉదయం అనంతపురం తహశీల్దార్ కార్యాలయం వద్ద లెఫ్ట్ నేతలు సీపీఐ రామకృష్ణ, సీపీఎం మధు, సినీనటుడు శివాజీ, చలసాని శ్రీనివాస్తో పాటు పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో ఈ దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ...కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా కోసం సీఎం చంద్రబాబు పోరాడాలని...లేకపోతే ప్రజలు తగినా విధంగా బుద్ధి చెప్పుతారని నేతలు సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement