కృష్ణా ఎక్స్‌ప్రెస్ బోగీలో పొగలు | Krishna express has stopped due to fire incident | Sakshi
Sakshi News home page

కృష్ణా ఎక్స్‌ప్రెస్ బోగీలో పొగలు

Feb 20 2014 2:04 AM | Updated on Sep 2 2017 3:52 AM

సికింద్రాబాద్ నుంచి విజయవాడ వైపునకు వెళ్తున్న కృష్ణా ఎక్స్‌ప్రెస్ వరంగల్ జిల్లా ఇంటికన్నె రైల్వేస్టేషన్ దాటాక మధ్య బోగీ కింద నుంచి పొగలు లోపలికి వస్తుండడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.

కేసముద్రం, న్యూస్‌లైన్: సికింద్రాబాద్ నుంచి విజయవాడ వైపునకు వెళ్తున్న కృష్ణా ఎక్స్‌ప్రెస్ వరంగల్ జిల్లా ఇంటికన్నె రైల్వేస్టేషన్ దాటాక మధ్య బోగీ కింద నుంచి పొగలు లోపలికి వస్తుండడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. దీంతో రైలును కేసముద్రం రైల్వేస్టేషన్‌లో అధికారులు నిలిపివేశారు. బ్రేక్‌లైనర్లు పట్టేయడం వల్లే పొగలు వ్యాపించినట్లు తెలిపారు. ఉదయం 9.25 గంటలకు వచ్చిన రైలు 15 నిమిషాల పాటు నిలిచిపోయింది.  రైల్వేసిబ్బంది మరమ్మతులు చేసి రైలును పంపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement