‘బియ్యం బాగున్నాయంటూ ప్రశంసలు’ | Kodali Nani About Quality Rice Distribution In Srikakulam | Sakshi
Sakshi News home page

70శాతం లబ్దిదారులకు బియ్యం పంపిణీ: నాని

Sep 7 2019 8:37 PM | Updated on Sep 7 2019 8:43 PM

Kodali Nani About Quality Rice Distribution In Srikakulam - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకాకుళం జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్ట్‌గా ప్రారంభించిన ‘నాణ్యమైన బియ్యం పంపిణీ’ పథకానికి మంచి స్పందన వస్తుందన్నారు మంత్రి కొడాలి నాని. జిల్లా వ్యాప్తంగా 8,60,727 మంది తెల్ల రేషన్‌ కార్డు లబ్దిదారులకు ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. రెండు రోజుల్లో 70 శాతానికి పైగా లబ్దిదారులకు గ్రామ వాలంటీర్లు 9,48,105 సంచుల బియ్యం సంచులను పంపిణీ చేశారన్నారు. గత నాలుగైదు రోజులుగా శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నప్పటికి.. ఇబ్బందులను అధిగమించి బియ్య రవాణా చేస్తున్నామన్నారు. వర్షాల కారణంగా 25 బియ్యం సంచులు తడిసిపోయాయని వాటి స్థానంలో కొత్తవాటిని తిరిగి పంపిణీ చేశామని మంత్రి నాని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement