తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేయండి: జానారెడ్డి | It speeds up the process of Telangana, says minister K.Janareddy | Sakshi
Sakshi News home page

తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేయండి: జానారెడ్డి

Sep 24 2013 3:13 PM | Updated on Sep 1 2017 11:00 PM

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ వేగవంతం కాకుంటే ఆ ప్రాంతంలో ఆందోళనలు ఎగసి పడే అవకాశాలు ఉన్నాయని హోంశాఖ మంత్రి షిండేకు స్పష్టం చేసినట్లు రాష్ట్ర మంత్రి కే.జానారెడ్డి వెల్లడించారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ వేగవంతం కాకుంటే ఆ ప్రాంతంలో ఆందోళనలు ఎగసి పడే అవకాశాలు ఉన్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేకు స్పష్టం చేసినట్లు రాష్ట్ర మంత్రి కే.జానారెడ్డి వెల్లడించారు. మంగళవారం న్యూఢిల్లీలో హోం మంత్రి షిండేను కలిశారు. 

 

అనంతరం విలేకర్ల సమావేశంలో  ఆయన మాట్లాడుతూ... ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే  తెలంగాణ ప్రక్రియను పూర్తి చేయాలని ఆయనకు సూచించినట్లు జానారెడ్డి చెప్పారు. గతంలో తెలంగాణపై సీడబ్ల్యూసీ తీసుకున్న తీర్మానం ప్రకారమే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని షిండేకు విన్నవించినట్లు జానారెడ్డి చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement