తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేయండి: జానారెడ్డి | It speeds up the process of Telangana, says minister K.Janareddy | Sakshi
Sakshi News home page

తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేయండి: జానారెడ్డి

Sep 24 2013 3:13 PM | Updated on Sep 1 2017 11:00 PM

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ వేగవంతం కాకుంటే ఆ ప్రాంతంలో ఆందోళనలు ఎగసి పడే అవకాశాలు ఉన్నాయని హోంశాఖ మంత్రి షిండేకు స్పష్టం చేసినట్లు రాష్ట్ర మంత్రి కే.జానారెడ్డి వెల్లడించారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ వేగవంతం కాకుంటే ఆ ప్రాంతంలో ఆందోళనలు ఎగసి పడే అవకాశాలు ఉన్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేకు స్పష్టం చేసినట్లు రాష్ట్ర మంత్రి కే.జానారెడ్డి వెల్లడించారు. మంగళవారం న్యూఢిల్లీలో హోం మంత్రి షిండేను కలిశారు. 

 

అనంతరం విలేకర్ల సమావేశంలో  ఆయన మాట్లాడుతూ... ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే  తెలంగాణ ప్రక్రియను పూర్తి చేయాలని ఆయనకు సూచించినట్లు జానారెడ్డి చెప్పారు. గతంలో తెలంగాణపై సీడబ్ల్యూసీ తీసుకున్న తీర్మానం ప్రకారమే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని షిండేకు విన్నవించినట్లు జానారెడ్డి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement