గురుకులంలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం | Invitation to apply for admission to gurukul | Sakshi
Sakshi News home page

గురుకులంలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

May 20 2014 4:35 AM | Updated on Oct 8 2018 7:48 PM

మహాత్మ జ్యోతిరావుపూలే బీసీ గురుకుల పాఠశాల (బాలికలు)లో ఐదో తరగతిలో ప్రవేశాని కి దర ఖాస్తులు ఆహ్వానిస్తున్నామని స్థాని క హౌసింగ్ బోర్డుకాలనీలోని గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ కె.రాజారావు ఆదివా రం ఒక ప్రకటనలో తెలిపారు.

 నెల్లూరు(టౌన్), న్యూస్‌లైన్: మహాత్మ జ్యోతిరావుపూలే బీసీ గురుకుల పాఠశాల (బాలికలు)లో ఐదో తరగతిలో ప్రవేశాని కి  దర ఖాస్తులు ఆహ్వానిస్తున్నామని స్థాని క హౌసింగ్ బోర్డుకాలనీలోని గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ కె.రాజారావు ఆదివా రం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.50 ఫీ జు చెల్లించి ఆన్‌లైన్, మీసేవా ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. రోస్టర్ ద్వారా దామాషా పద్ధతిలో లాటరీ ద్వారా ఎంపికలు నిర్వహిస్తామని తెలిపారు.

 

దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 25 వరకు గడువుందన్నారు. గుర్తింపు పొందిన పాఠశాలలో 4వ తరగతి చదివి ఉండాలన్నా రు. 6వ తరగతిలో చేరేందుకు ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కో ట, దొరవారి సత్రంలోని గురుకుల పాఠశాలలో బాలురు 6,7,8 తరగతుల్లో చేరేం దుకు ఈ నెల 30వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. బాలికలకు నెల్లూరు లో 80 సీట్లు, కోట, దొరవారిసత్రంలో బా లురకు 80 ఖాళీలు ఉన్నాయన్నారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement