ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు రైల్వే ఉద్యోగి బలి | Railway employee falls victim to online betting | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు రైల్వే ఉద్యోగి బలి

Jun 7 2026 11:30 AM | Updated on Jun 7 2026 11:31 AM

Railway employee falls victim to online betting

సాక్షి, మహబూబాబాద్: డోర్నకల్ మండలం వెన్నారంలో  విషాదం చోటుచేసుకుంది.  ఒక రైల్వే ఉద్యోగి ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో అధికంగా డబ్బులు వస్తాయని ఆశతో అధికంగా డబ్బులు పెట్టాడు. అయితే బెట్టింగ్‌లో వాటిని కోల్పోయాడు.  దీంచో తీవ్ర మనోవేదనతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాలు తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

కాగా ఆన్‌లైన్ బెట్టింగ్‌పై ప్రభుత్వం ఎంత అవగాహన కల్పిస్తున్నా ప్రజల తీరులో మార్పు రావడం లేదు. వాటి జోలికి పోవద్దంటూ ఎన్ని హెచ్చరికలు జారీ చేసిన తీరుమారడం లేదు. తాజాగా మహబూబాబాద్‌లో జరిగిన సంఘటనే దానికి నిదర్శనం.

Advertisement
 
Advertisement
Advertisement