ఓ ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో హరి అనే ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థి మృతి చెందగా మరో ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి.
అనంతపురం: అనంతపురం జిల్లా విడపనకల్ మండలం హావళిగి వద్ద మంగళవారం సాయంత్రం ఓ ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో హరి అనే ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థి మృతి చెందగా మరో ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వారికి స్థానికంగా చికిత్స అందించారు. ఉరవకొండ నుంచి ఆటో విద్యార్థులతో హావళిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుడితోపాటు గాయపడిన వారు హావళిగికి చెందిన వారిగా గుర్తించారు.