గురి చూసి కొట్టాలిరా..
● ఉత్సాహంగా రైఫిల్, పిస్టల్ షూటింగ్ శిక్షణ
●డీఎస్ఏ మైదానంలో ఉదయం, సాయంత్రం వేళల్లో నిర్వహణ
● జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణింపు
● వివిధ సంస్థల్లో పలువురికి ఉద్యోగాలు డీఎస్ఏ రైఫిల్ షూటింగ్ అకాడమీలో
శిక్షణ పొందుతున్న విద్యార్థులునాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): దీపావళి వచ్చిందంటే చాలు.. తుపాకులు పట్టుకుని టేపులు పేల్చుతూ ఆ చప్పుడు విని చిన్నారులు ఎంతో సంబరపడిపోతూంటారు. చిన్నప్పుడు దొంగా–పోలీసు ఆట ఆడేటప్పుడు పోలీసుగా ఉన్న కుర్రాడు బొమ్మ తుపాకి పట్టుకుని డిష్యూం డిష్యూం అని శబ్దాలు చేస్తూ నిజంగానే తుపాకితో కాల్చుతున్నట్లు ఊహించుకుని ఆనందపడిపోతూంటాడు. ఇటువంటి సన్నివేశాలు చాలా మందికి చిన్ననాటి గురుతులే. సినిమాల్లో హీరో తుపాకి పట్టుకుని విలన్ గ్యాంగ్లపై కాల్పులు జరుపుతూంటే అందరికీ ఉత్సాహంగానే ఉంటుంది. అలా చూసిన చాలా మంది తాము కూడా షూటింగ్ నేర్చుకోవాలని, వివిధ పోటీల్లో పాల్గొని గుర్తింపు తెచ్చుకోవాలని అనుకుంటూంటారు. అటువంటి వారి కలలను సాకారం చేస్తోంది జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (డీఎస్ఏ) క్రీడా మైదానంలో జరుగుతున్న రైఫిల్ షూటింగ్ వేసవి శిక్షణ.
షూటింగ్లో దేశానికి పతకాలు సాధించిన అభినవ్ బింద్రా, విజయ్, జీతూరాయి, అంజలీ భగవత్ల స్ఫూర్తితో రైఫిల్ షూటింగ్పై ఉన్న మక్కువతో కోచ్ మహ్మద్ అలీషా షరీఫ్ ఈ శిక్షణ ప్రారంభించారు. దీనికోసం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) నిధులతో 2018లో రైఫిల్, పిస్టల్ షూటింగ్ అకాడమీ ఏర్పాటు చేశారు. ఈ అకాడమీ ద్వారా ఇప్పటి వరకూ 1,500 మంది షూటింగ్లో శిక్షణ పొందారు. వీరిలో పలువురు ప్రభుత్వ, అగ్నిమాపక, డిఫెన్స్ రంగాలతో పాటు ప్రైవేటు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. మరికొంత మంది ఇంజినీరింగ్, మెడిసిన్ చదువుతున్నారు. ఈ అకాడమీలో శిక్షణ పొందిన వారిలో 278 మంది వివిధ జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణించి, 39 బంగారు, 162 రజత, 89 కాంస్య పతకాలు సాధించడం విశేషం.
వేసవి శిక్షణ ఇస్తున్నారిలా..
జిల్లా క్రీడా మైదానంలో ఈ నెల 15న వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఇక్కడి రైఫిల్, పిస్టల్ షూటింగ్ అకాడమీలో సుమారు 15 మంది క్రీడాకారులు శిక్షణ పొందుతున్నారు. ప్రతి రోజూ ఉదయం 6 నుంచి 9, సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకూ వీరికి శిక్షణ ఇస్తున్నారు. 10 మీటర్ల రేంజ్ ఉన్న ఈ అకాడమీలో క్రీడాకారులకు రైఫిల్ షూటింగ్లో కోచ్ షరీఫ్ మెళకువలు నేర్పిస్తున్నారు. అకాడమీలో రెండు గన్లు, ఒక తుపాకి ఉన్నాయి. వీటితోనే హ్యాండ్ పవర్, బ్యాలెన్స్, ఐసైట్, స్టాండింగ్ పొజిషన్లలో షూటింగ్ శిక్షణ ఇస్తున్నారు. క్రీడాకారులకు మెరుగైన శిక్షణ ఇవ్వాలంటే శాప్ నుంచి అంతర్జాతీయ స్థాయి రైఫిల్స్ 4, పిస్టల్స్ 4, ఇతర షూటింగ్ పరికరాలు కావాలి. ప్రస్తుతం ఐదు ఎలక్ట్రిక్ టార్గెట్లు వాడుతున్నారు. వీటి స్థానంలో ఆధునిక సిస్టమ్ టార్గెట్లు ఏర్పాటు చేస్తే మరిన్ని పతకాలు సాధించడానికి అవకాశం ఉంటుందని కోచ్ షరీఫ్ చెబుతున్నారు. రైఫిల్, పిస్టల్ పోటీల్లో వినియోగించే ఆయుధాలను పెసివోల్, వాల్టేర్ కంపెనీలు తయారు చేస్తున్నాయి. ప్రారంభ దశలో ఉన్న వారికి రూ.13 వేల నుంచి రూ.3.5 లక్షల వరకూ వీటి ధరలున్నాయి. రైఫిల్ షూటింగ్ సూట్ రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకూ మార్కెట్లో లభ్యమవుతోంది. షూ రూ.27 వేల నుంచి అందుబాటులో ఉంది. టార్గెట్ ఎయిమ్ చేస్తున్న
క్రీడాకారుడుఅన్నవరంలో నేడు
తెల్లవారుజామున 3.00 : సుప్రభాత సేవ.
ఉదయం 8.00 : చతుర్వేద పారాయణ.
మధ్యాహ్నం 2.30 : అనివేటి మండపంలో సత్యదేవుడు, అమ్మవారి సమక్షంలో సరస్వతీ పూజ. వేద పండిత సదస్యం, పండిత సత్కారం.
రాత్రి 9.00 : కొండ దిగువన పొన్నచెట్టు వాహనంపై సత్యదేవుడు, అమ్మవారి ఊరేగింపు.
ఉదయం 7.00 – 10.00, సాయంత్రం 5.00 – రాత్రి 11.00 : రత్నగిరి కళావేదిక మీద, కొండ దిగువన సాంస్కృతిక కార్యక్రమాలు.రథోత్సవంలో అన్ని
జాగ్రత్తలూ తీసుకోవాలి అన్నవరం: వార్షిక దివ్య కల్యాణ మహోత్సవాల్లో భాగంగా సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని ఈ నెల 22న నూతన రథంపై ఊరేగించే సమయంలో అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని రాష్ట్ర దేవదాయ, ధర్మదాయ శాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ ఆదేశించారు. రథాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. ఆయనకు రథం వివరాలను ఈఓ కె.రామచంద్ర మోహన్ వివరించారు. ఈ రథాన్ని రూ.1.08 కోట్లతో తయారు చేయించిన విషయం విదితమే. దేవస్థానంలో సుమారు 36 అడుగుల ఎత్తు, 14.6 అడుగుల వెడల్పు, 21 అడుగుల పొడవు కలిగిన పెద్ద రథం ఇది. దీనికి ఈ నెల 16న ట్రయల్ రన్ వేశామని ఈఓ తెలిపారు. కొన్ని సాంకేతిక ఇబ్బందులు మినహా ట్రయల్ రన్ విజయవంతమైందని చెప్పారు. రథం జాకీకి సంబంధించిన మోటార్ సామర్థ్యం చాలలేదని, దీనిని మార్చి రెండు హార్స్పవర్ మోటార్ బిగించామని వివరించారు. ఆ మోటార్ను జనరేటర్ సహాయంతో నిర్వహించేలా ఏర్పాట్లు చేశామనిన్నారు. రథంతో పాటు జనరేటర్ కూడా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ విశ్వనాథరాజు, ఏఈఓ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. సత్యదేవుడు, అమ్మవార్లకు అరుంధతీ నక్షత్ర దర్శనం చేయిస్తున్న పండితులు
రావణబ్రహ్మ వాహనంపై సత్యదేవుని ఊరేగింపులో దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్● వేడుకగా అరుంధతీ నక్షత్ర దర్శనం
● రావణబ్రహ్మ వాహనంపై ఊరేగింపుఅన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజైన సోమవారం సాయంత్రం నవదంపతులు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లకు దర్బారు మండపంలో స్థాలీపాక హోమాలు నిర్వహించారు. రాత్రి ఏడు గంటలకు స్వామి, అమ్మవార్లను తూర్పు రాజగోపురం ముందున్న ఆవరణలోకి ఊరేగింపుగా తీసుకుని వచ్చారు. అక్కడ స్వామి, అమ్మవార్లకు పండితులు అరుంధతీ నక్షత్రాన్ని చూపించి, పూజలు చేశారు. కార్యక్రమంలో వేద పండితులు గొల్లపల్లి ఘనపాఠి, యనమండ్ర శర్మ, గంగాధరభట్ల గంగబాబు, ముష్టి పురుషోత్తం, ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యశర్మ, దేవస్థానం వైదిక కార్యక్రమాల పర్యవేక్షకుడు నాగాభట్ల కామేశ్వరశర్మ, వైదిక కమిటీ సభ్యుడు చామర్తి కన్నబాబు, వ్రత పురోహితులు నాగాభట్ల రవిశర్మ, పాలంకి పట్టాభి తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా సత్యదేవుని ఊరేగింపు
సత్యదేవుడు, అమ్మవారిని రావణబ్రహ్మ వాహనం మీద ఘనంగా ఊరేగించారు. రాత్రి తొమ్మిది గంటలకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా కొండ దిగువన ఉన్న తొలి పావంచా వద్దకు తీసుకు వచ్చారు. అక్కడ సర్వాంగసుందరంగా అలంకరించిన రావణబ్రహ్మ వాహనంపై స్వామి, అమ్మవార్లను వేంచేయించి, పండితులు పూజలు చేశారు. స్వామి, అమ్మవార్లకు దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ పూజలు చేశారు. అనంతరం రావణబ్రహ్మ వాహనం ముందు కొబ్బరి కాయ కొట్టి ఊరేగింపు ప్రారంభించారు. రత్నగిరి తొలి పావంచా వద్ద నుంచి ఆంధ్రా బ్యాంక్ సెంటర్ వరకూ.. అక్కడి నుంచి తిరిగి తొలి పావంచా వరకూ ఈ ఊరేగింపు కోలాహలంగా సాగింది. ఈ సందర్భంగా పలువురు కళాకారులు ప్రదర్శించిన జానపద నృత్యాలు, ఇతర కళారూపాలు అధిక సంఖ్యలో తరలివచ్చిన గ్రామస్తులను, భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ ఊరేగింపును పురస్కరించుకుని గ్రామంలోకి భారీ వాహనాలను అనుమతించలేదు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఊరేగింపు సాగినంతసేపూ బాణసంచా కాల్చారు.ఏకాగ్రత ఉండాలి
రైఫిల్ షూటింగ్ ఏకాగ్రతతో కూడుకున్న క్రీడ. ఇందులో రాణించాలంటే సహనం, ఓపిక ఉండాలి. టార్గెట్ పైనే దృష్టి సారిస్తే పతకం సాధించడం సులువే. ఈ క్రీడలో రాణించే వారికి విద్య, ఉద్యోగావకాశాలు అధికంగా ఉన్నాయి.
– మహ్మద్ అలీషా షరీఫ్,డీఎస్ఏ రైఫిల్ షూటింగ్ కోచ్
డిఫెన్స్లో ఉద్యోగం సాధించాలని..
పీఆర్ ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాను. జాతీయ స్థా యి రైఫిల్ షూటింగ్లో పతకం సాధించడం నా లక్ష్యం. డిఫెన్స్ స ర్వీసెస్లో ఉద్యోగం సాధించడం కోసం సమ్మర్ క్యాంప్లో షూటింగ్ నేర్చుకుంటున్నాను.
– ఎన్.పవన్కుమార్
ఐఏఎస్ కావడమే లక్ష్యం
ఇంటర్ సెకండియర్ చదువుతున్నాను. డీఎస్ఏలో నాలుగు సంవత్సరాలుగా శిక్షణ పొందుతున్నాను. రాష్ట్ర స్థాయి లో బంగారు, రజత, కాంస్య పతకాలు సాధించాను. ఐఏఎస్ సాధించి, స్థిరపడాలన్నది నా లక్ష్యం.
– మొహియుద్దీన్ షేక్, జాతీయ స్థాయి క్రీడాకారుడు
సంపర నుంచి వస్తున్నాను
రైఫిల్ షూటింగ్ నేర్చుకోవడానికి నేను ప్రతి రోజూ సంపర గ్రామం నుంచి వస్తున్నాను. కోచ్ సమీర్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్నాను. కాకినాడలో డిగ్రీ చదువుతున్నాను. చిన్నప్పటి నుంచీ రైఫిల్ షూటింగ్ అంటే ఇష్టం. క్రీడా కోటాలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్నది నా లక్ష్యం.
– నాగిరెడ్డి బాలా త్రిపురసుందరీదేవి, డిగ్రీ విద్యార్థిని