గనుల అక్రమ తవ్వకాలపై సర్కారు కొరడా | Illegal Granite Mining In Prakasam District | Sakshi
Sakshi News home page

ప్రకాశం జిల్లాలో భారీగా గనుల దోపిడీ

Feb 18 2020 7:26 PM | Updated on Feb 18 2020 7:32 PM

Illegal Granite Mining In Prakasam District - Sakshi

సాక్షి, విజయవాడ/ప్రకాశం: ప్రకాశం జిల్లాలో గనుల అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. ఐదు నెలలుగా సర్వే చేపట్టిన గనుల శాఖ అధికారులు వందల కోట్లు దోపిడీని గుర్తించారు. ఈ అడ్డగోలు గనుల తవ్వకాల వెనుక టీడీపీ నేతల ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. లైసెన్స్‌ను పరిధిని మించి తవ్వకాలు జరిపినట్లు గనుల శాఖ గుర్తించింది. బల్లికురవ మండలం కొనిదెన లో ఓ కంపెనీ భారీ దోపిడీ కి పాల్పడింది. 17 లక్షల 76 వేల 137 క్యూబిక్ మీటర్ల తవ్వకాలు చేసింది. 15 శాతం రికవరితో 2 లక్షల 66 వేల క్యూబిక్ మీటర్ల గ్రానైట్ గా అధికారులు తేల్చారు. లక్షా 216 క్యూబిక్ మీటర్లకు మాత్రమే అనుమతి తీసుకున్న సంస్థ.. అక్రమంగా లక్షా 66 వేల 204 క్యూబిక్ మీటర్లు తవ్వేసింది. అక్రమ మైనింగ్‌ కి పాల్పడిన ఓ కంపెనీకి రూ.285 కోట్ల ఫీజు కట్టాలని ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. టీడీపీ నేతల దోపిడీని కప్పిపుచ్చేందుకు ఎల్లో మీడియా వింత రాతలు రాయడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement