ఐకేపీ మహిళలు కలెక్టరేట్ ముట్టడి

ఐకేపీ మహిళలు కలెక్టరేట్ ముట్టడి - Sakshi


ఏలూరు:  వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఐకేపీ (ఇందిరా క్రాంతి పథకం)మహిళలు సిఐటియు ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ను ముట్టడించారు.  ఓ మహిళా పోలీస్ని చితకబాదారు.   పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.  గేటు బయట బైఠాయించిన మహిళలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారీ సంఖ్యలో వచ్చిన మహిళలను అదుపు చేయడం పోలీసులకు కష్టమైపోయింది.



15 నెలలుగా తమకు జీతాలు లేవని ఆ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. రెండు నెలలుగా తాము ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించడంలేదని చెప్పారు. తమ జీతాలు తమకు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

**

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top