కొత్త రాజధానికి ఆశీస్సులివ్వాలని ప్రార్థించా | i ask god give blessings to capital city | Sakshi
Sakshi News home page

కొత్త రాజధానికి ఆశీస్సులివ్వాలని ప్రార్థించా

Jun 3 2015 2:34 AM | Updated on Jul 29 2019 2:44 PM

కొత్త రాజధానికి ఆశీస్సులివ్వాలని ప్రార్థించా - Sakshi

కొత్త రాజధానికి ఆశీస్సులివ్వాలని ప్రార్థించా

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణానికి ఆశీస్సులివ్వాలని తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని ప్రార్థించానని శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు.

సాక్షి, తిరుమల: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణానికి ఆశీస్సులివ్వాలని తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని ప్రార్థించానని శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. మంగళవారం ఉదయం నైవేద్య విరామ సమయం అనంతరం ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఏడాది పాలన సమర్థవంతంగా సాగిందన్నారు. ఈ వారంలోనే  నూతన రాజధాని నిర్మాణానికి  శంకుస్థాపన జరగనుందన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఇదొక కీలక పరిణామమని చెప్పారు. ఇందుకు శ్రీవారు కూడా సంపూర్ణమైన ఆశీస్సులు అందిస్తారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement