అకాలంలో ముంచింది

Huge rains in several districts - Sakshi

పలు జిల్లాల్లో వానలు

సాక్షి, నెట్‌వర్క్‌: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన భారీవర్షం కురిసింది. బలమైన ఈదురుగాలులకుతోడు పెద్ద ఎత్తున వడగళ్లు కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

కాలంకాని కాలంలో కురిసిన ఈ వర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. చిత్తూరు, కడప, అనంతపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఈ వర్షం తీవ్రనష్టం కలిగించింది. కాగా  రాష్ట్రంలో అకాల వర్షాలు మరో మూడు రోజులపాటు కొనసాగనున్నాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top