‘ఈ’ వ్యవ‘సాయం’
వచ్చే ఖరీఫ్ నుంచి పూర్తి స్థాయిలో అమలు
‘మీ-సేవ’లో సైతం లావాదేవీలు
సబ్సిడీ విత్తు, పంట బీమా సేవలు
ఒక్కో లావాదేవిపై రూ.20 చార్జీ
పెరగనున్న పారదర్శకత
సాక్షి, సంగారెడ్డి:
ఇకపై ఆన్లైన్లో సబ్సిడీ విత్తనాల విక్రయాలు జరపనున్నారు. మండల వ్యవసాయ కార్యాలయాలు, మీ-సేవ’ కేంద్రాలు రైతులకు ఆన్లైన్ విధానంలో విత్తన పర్మిట్లు జారీ చేయనున్నాయి. ‘మీ-సేవ’ కేంద్రాల్లో విత్తనాల విక్రయాలతో పాటు పంట బీమా ప్రీమియం వసులూ చేయనున్నారు.
అయితే ఒక్కో లావాదేవిపై రూ.20 చార్జీని వసూలు చేయనున్నాయి. వివిధ పథకాల కింద దాదాపు 50 శాతం వరకు సబ్సిడీపై ప్రభుత్వం పంపిణీ చేస్తున్న విత్తనాలు ప్రతి ఏటా దారిమళ్లి దుర్వినియోగమవుతున్నాయి. పారదర్శకత కోసం అమలు చేస్తున్న ‘ఈ’ విధానం వల్ల ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేస్తున్న విత్తనాలను ఎవరెవరికి అందుతున్నాయో క్షణాల్లో తెలుసుకోవచ్చు. గత ఖరీఫ్ సీజన్లో సిద్దిపేట రెవెన్యూ డివిజన్ పరిధిలో పెలైట్ ప్రాజెక్టుగా ఆన్లైన్ విధానాన్ని అమలు చేశారు. గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక ప్రాంతాల్లో మొక్కజొన్న రైతుల నుంచి పంట బీమా ప్రీమియం సొమ్మును ‘మీ-సేవా’ కేంద్రాల్లో కట్టించుకున్నారు. ఇకపై పంట బీమా ప్రీమియం వసూలుతో పాటు సబ్సిడీ విత్తనాల విక్రయాలు సైతం ‘మీ-సేవా’లో జరపనున్నారు. వచ్చే ఖరీఫ్ నుంచి జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ‘ఈ’ విధానంపై వ్యవసాయ అధికారులు, ఏడీఏలు, మీ-సేవ కేంద్రాల నిర్వాహకులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
జాతీయ ఆహార భద్రత కార్యక్రమం(ఎన్ఎఫ్ఎస్ఎం), సీడ్ విలేజ్ తదితర పథకాల ద్వారా ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై విత్తనాలను పంపిణీ చేస్తోంది. ప్రైవేటు డీలర్లు, మన గ్రోమోర్, ఏపీ ఆగ్రోస్, హాకా, పీఏసీఎస్ల ద్వారా సబ్సిడీ విత్తనాలు విక్రయిస్తున్నారు. జిల్లాలో సబ్సిడీ విత్తనాల విక్రయం కోసం 118 సంస్థలు లెసైన్స్ కలిగి ఉన్నాయి. వీటితో పాటు జిల్లాలో గల 220 మీ-సేవా కేంద్రాల ద్వారా సైతం విత్తనాల విక్రయాలు జరగనున్నాయి. పట్టాదారు పాస్పుస్తకాలు చూపెట్టిన రైతులకు మండల వ్యవసాయ కార్యాలయాలు విత్తన పర్మిట్లు జారీ చేస్తే పైన పేర్కొన్న కేంద్రాల్లో విక్రయాలు జరుగుతున్నాయి. ఆన్లైన్ విధానం అమల్లోకి వస్తే.. రైతుల వివరాలతో పాటు పట్టాదారు పాస్పుస్తకాన్ని స్కాన్ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. అనంతరం నాన్ సబ్సిడీ మోత్తాన్ని రైతు నుంచి వసూలు చేసి ఓ పర్మిట్ను రైతు చేతికి అందిస్తారు. పర్మిట్లో సూచించిన విక్రయ కేంద్రానికి వెళ్లితే రైతుకు కోరిన విత్తనాలు లభ్యం కానున్నాయి.
ఆన్లైన్లో విత్తు
Published Tue, Jan 28 2014 11:05 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీడీపీ వాళ్ళు నన్ను డైరెక్ట్ ఎదుర్కోలేక: RK రోజా
బీజేపీలో చేరిన రాధికా ఖేరా.. ఎవరీమె?
కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు.. బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
బీజేపీపై డింపుల్ యాదవ్ కీలక వ్యాఖ్యలు: పదేళ్లలో..
ఆవిడ ఉత్తరం రాస్తే అధికారులను మార్చేస్తారా..!
డీప్ఫేక్ టెక్నాలజీకోసం ఇంటెల్తో జతకట్టనున్న ప్రముఖ కంపెనీ
ఇచ్చాపురంలో సీఎం జగన్ రోడ్ షో, జనసంద్రంగా మారిన ప్రధాన రహదారి (ఫోటోలు)
Rashmi Gautam: విదేశాల్లో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్న రష్మి (ఫోటోలు)
ప్రచారంలో మహిళలతో కలిసి డాన్స్ చేసిన వంశీ భార్య
కూల్ లుక్తో కేక పుట్టిస్తున్న బాలీవుడ్ బ్యూటీ హీనా ఖాన్ (ఫొటోలు)
తప్పక చదవండి
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement