తల్లి మందలించిందని ఆత్మహత్యాయత్నం | girl suicide attempt in bobbili | Sakshi
Sakshi News home page

తల్లి మందలించిందని ఆత్మహత్యాయత్నం

May 14 2015 2:06 PM | Updated on Sep 3 2017 2:02 AM

ఏ పనీ చేయకుండా ఖాళీగా కూర్చుంటోందని తల్లి మందలించటంతో కూతురు ఆత్మహత్యకు యత్నించింది.

విజయనగరం : ఏ పనీ చేయకుండా ఖాళీగా కూర్చుంటోందని తల్లి మందలించటంతో కూతురు ఆత్మహత్యకు యత్నించింది. విజయనగరం జిల్లా బాడంగి మండలం అల్లుపాల్తేరు గ్రామంలో గురువారం ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన అల్లు త్రివేణి(18) ఇటీవలే ఇంటర్ పూర్తి చేసింది. చెప్పిన పని చేయడం లేదని ఆమెను తల్లి మందలించింది. మనస్తాపానికి గురైన యువతి ఇంట్లో ఉన్న చీమలమందు తాగింది. ఆ గ్రామానికి రవాణా సౌకర్యం లేకపోవటంతో నాలుగు గంటలు ఆలస్యంగా ఆమెను కుటుంబసభ్యులు బొబ్బిలి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈలోగా ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం వైద్యులు చికిత్స కొనసాగిస్తున్నారు.
(బొబ్బిలి)


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement