తెలుగుదేశం పార్టీ నేత,మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడు రవితేజ, అతని స్నేహితుడు ఇంద్రజిత్లను పోలీసులు ఈ రోజు చర్లపల్లి జైలుకు తరలించారు.
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నేత,మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడు రవితేజ, అతని స్నేహితుడు ఇంద్రజిత్లను పోలీసులు ఈ రోజు చర్లపల్లి జైలుకు తరలించారు. వీరిద్దరూ మస్తుగా మద్యం సేవించి సోమవారం తెల్లవారుజామున శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వీరంగం సష్టించిన విషయం తెలిసిందే. వారిని పోలీసులు సోమవారం రాత్రి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించారు. అయితే సమయం మించిపోవడంతో జైలు అధికారులు వారిని జైలులోకి అనుమతించలేదు.
రాత్రంతా ఇద్దరినీ శంషాబాద్ పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. రవితేజ, ఇంద్రజిత్లను ఈ రోజు పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు.