హైదరాబాద్, న్యూస్లైన్: అయిన వారే కాలయములయ్యారు. భార్య, కుమారులు, బావమరిది కలిసి ఆర్మీ మాజీ ఉద్యోగిని మెడ నరికి దారుణంగా చంపేశారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు, ఆస్తి తగదాలే ఈ హత్యకు కారణమని తెలిసింది. స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించిన ఈ ఘటన ఆదివారం హైదరాబాద్లోని శ్రీనివాసపురంలో జరిగింది. సీఐ లక్ష్మీకాంత్రె డ్డి, స్థానికుల కథనం ప్రకారం... ప్రకాశం జిల్లా రాచర్ల మండలం ఆకివీడు గ్రామానికి చెందిన నందమూరి చిన్న వెంకటరెడ్డి(55) నగరానికి వచ్చి శ్రీనివాసపురంలో స్థిరపడ్డారు.
ఈయనకు భార్య చెన్నమ్మ, కుమారులు వెంకట రమణారెడ్డి(30), విజయకుమార్రెడ్డి(27), కుమార్తె రమాదేవి(28) ఉన్నారు. పిల్లలు ముగ్గురూ ఉన్నత చదువులు అభ్యసించారు. ఆర్మీలో పని చేసిన వెంకటరెడ్డి పదవీ విరమణ తర్వాత ఇక్కడే ఉంటున్నారు. ప్రస్తుతం ఈయన నేషనల్ ఇన్సూరెన్స్ కంపనీలో పని చేస్తున్నారు. వెంకటరెడ్డికి రామంతాపూర్లో రెండు ఇళ్లు, బోడుప్పల్లో రెండు పాట్లు, స్వగ్రామంలో పొలం ఉంది. ఏడాదిన్నర క్రితం రామంతాపూర్లోని ఇల్లును అమ్మకానికి పెట్టగా భార్య ఒప్పుకోలేదు. దీంతో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు మొదలై తారస్థాయికి చేరాయి. గతంలో రెండుసార్లు వెంకటరెడ్డిపై భార్య ఉప్పల్ పోలీస్స్టేషన్లో కేసు పెట్టింది.
పోలీసులు ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా వారిలో విభేదాలు తగ్గలేదు. ఈ నేపథ్యంలో వెంకటరెడ్డి కొంతకాలంగా కోఠిలోని లాడ్జిలో ఉంటున్నారు. 20 రోజుల క్రితం స్థానిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భార్యాభర్తలు రాజీ కుదుర్చుకున్నారు. ఇకపై ఎలాంటి గొడవలు పడకుండా కలిసుందామని ఒట్టుపెట్టుకొని.. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. అయినా.. ఇద్దరి మధ్య గొడవలు తగ్గలేదు. భర్తపై పగ పెంచుకున్న భార్య అతడిని అంతం చేయాలని నిర్ణయించుకుంది. కొడుకులు, తన సోదరుడు భాస్కర్రెడ్డి (మాజీ ఆర్మీ ఉద్యోగి) తో కలిసి భర్త హత్యకు పథకం వేసింది. ఇందులో భాగంగా మాట్లాడుకుందామని వెంకటరెడ్డిని ఆదివారం మధ్యాహ్నం ఇంటికి పిలిపించారు. మాటల్లో పెట్టి వేటకోడవలితో మెడ నరికారు. కడుపులో పొడిచి, తలపై రోకలి బండతో మోది చంపేశారు. హత్య అనంతరం నిందితులు పోలీసుస్టేషన్కు వెళ్లి లొంగిపోయినట్లు తెలిసింది. మల్కాజిగిరి ఏసీపీ చెన్నయ్య, ఉప్పల్ సీఐ లక్ష్మీకాంత్రెడ్డి, డీఐ వెంకటరెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని మతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
అమానుషం..
Published Mon, Jan 13 2014 3:38 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
థ్యాంక్స్ టూ మనీష్ మల్హోత్రా.. సమ్మర్ 2024 స్పెషల్ డిజైన్స్ (ఫొటోలు)
సీఎం జగన్ పేదలకు డబ్బు పంచడంపై పోసాని హాట్ కామెంట్స్
కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం
టీ20 వరల్డ్కప్ 2024 కోసం మరో జట్టు ప్రకటన
శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్
హైదరాబాద్లో భారీగా భూమిని కొన్న మైక్రోసాఫ్ట్!
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
మరో మహిళతో రొమాన్స్.. చాలా ఎగ్జైట్ అయ్యానన్న సోనాక్షి
‘రైతుల భూ డాక్యుమెంట్లను బుగ్గిపాలు చేసింది బాబేగా!’
ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహిళా కమిషన్ అధ్యక్షురాలు
తప్పక చదవండి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’.. కాంగ్రెస్పై ప్రధాని మోదీ విమర్శలు
- ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహిళా కమిషన్ అధ్యక్షురాలు
- ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా ఓటేయవచ్చు!
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ఎయిరిండియా సిబ్బంది సిక్ లీవ్.. 70కి పైగా విమానాలు రద్దు
- CM Jagan అంటే ఒక పాఠం: నటి శ్యామల
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
Advertisement