జనావాసాల్లోకి దేవాంగపిల్లి
రాపూరు: స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహం వద్ద ఆదివారం దేవాంగపిల్లి తిరుగుతుండగా ప్రజలు దానిని అటవీశాఖ అధికారులకు అప్పగించారు. దానిని రాపూరు చిట్వేలి మార్గమధ్యంలోని అడవుల్లో వదిలినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. రాపూరులో ఆర్అండ్బీ అతిథిగృహం వద్ద దేవాంగపిల్లి తిరుగుతుండగా స్థానికులు అటవీశాఖాధికారులకు సమాచారం అందించారు.