ఇరు వర్గాల మధ్య ఘర్షణ... | fight against two groups in buduru | Sakshi
Sakshi News home page

ఇరు వర్గాల మధ్య ఘర్షణ...

Jan 25 2015 12:25 PM | Updated on Mar 18 2019 9:02 PM

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం బూదురు గ్రామంలో వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఆదివారం ఘర్షణ తలెత్తింది.

మంత్రాలయం(కర్నూలు): కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం బూదురు గ్రామంలో వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య ఆదివారం ఘర్షణ తలెత్తింది. ఇరు వర్గాలు దాడులు చేసుకోవడంతో కాంగ్రెస్ నేత ధనంజయ రెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనలో వైఎస్సార్ సీపీకి చెందిన ఇద్దరు కార్యకర్తలు కూడా గాయపడ్డారు. ధనంజయరెడ్డిని కర్నూలులోనిఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement