ఇరు వర్గాల మధ్య ఘర్షణ... | fight against two groups in buduru | Sakshi
Sakshi News home page

ఇరు వర్గాల మధ్య ఘర్షణ...

Jan 25 2015 12:25 PM | Updated on Mar 18 2019 9:02 PM

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం బూదురు గ్రామంలో వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఆదివారం ఘర్షణ తలెత్తింది.

మంత్రాలయం(కర్నూలు): కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం బూదురు గ్రామంలో వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య ఆదివారం ఘర్షణ తలెత్తింది. ఇరు వర్గాలు దాడులు చేసుకోవడంతో కాంగ్రెస్ నేత ధనంజయ రెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనలో వైఎస్సార్ సీపీకి చెందిన ఇద్దరు కార్యకర్తలు కూడా గాయపడ్డారు. ధనంజయరెడ్డిని కర్నూలులోనిఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు.

Advertisement
 
Advertisement
Advertisement