రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులు మృతి | Father, son died in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులు మృతి

May 15 2015 2:48 AM | Updated on Sep 2 2018 4:37 PM

చిక్కాలపాలెం సమీపంలో జరిగిన రోడ్డుప్రమాదంలో తండ్రికొడుకులు మ రణించారు.

 చిక్కాలపాలెం (చాగల్లు) :చిక్కాలపాలెం సమీపంలో జరిగిన రోడ్డుప్రమాదంలో తండ్రికొడుకులు మ రణించారు.  పోలీసులు,స్ధానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చాగల్లు మండలం కలవలపల్లికి చెందిన చాపల వెంకట్రావు(50), అతని కుమారుడు చాపల రవి(30) ఈ ప్రమాదంలో మృతిచెం దారు. దేవరపల్లి మండలం దుద్దుకూరులో బంధువుల ఇంట్లో వివాహ వేడుకలకు వెళ్లి మోటర్‌సైకిల్‌పై ఇద్దరు తిరిగి వస్తున్నారు. మధ్యలో వెంకట్రావుకు కుమార్తెను చూడాలనిపించటంతో కొవ్వూ రు మండలం వాడపల్లిలో ఉంటున్న ఆమె ఇంటికి బయలుదేరారు. చిక్కాలపాలెం శివారులో రొంపుగుంట చెరువు వద్ద రోడ్డు ప్రక్కన వున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో తండ్రికొడుకులకు తీవ్రగాయాలై అక్కడక్కడే మరణించారు. వీరు కూలీలు. చాగల్లు పోలీస్‌స్టేషన్ రైటర్ నాగరాజు,హెచ్‌సీ డి.కొటేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.
 
 మృత్యువులోనూ కలిసే
 వెంకట్రావు, రవి స్నేహితుల్లా కలిసిమెలసి ఉండేవారని స్థానికులు తెలిపారు. వెంకట్రావుకు ముగ్గురు కుమారులు, ఓ అమ్మాయి ఉన్నారు. అతని భార్య మార్తమ్మ ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశం వెళ్లింది. వెంకట్రావు పెద్ద కుమారుడు రవికి వివాహమైంది. అతనికి భార్య భవాని, ఓ కుమారుడు ఉన్నారు. ఈ ఘటనతో కలవలపల్లిలో విషాదచాయలు ఆలముకున్నాయి. ఘటనా స్థలంలో మృతిదేహాలు పడి ఉన్న తీరు చూసిన వారినీ కలచివేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement