రెవెన్యూ అధికారులకు కౌలు రైతులు ఇప్పటికి గుర్తొచ్చారు. ఖరీఫ్ ప్రారంభమయ్యాక రుణ అర్హత కార్డుల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.
- నేటి నుంచి 21 వరకు గ్రామ సభలు
- కౌలు రైతుల నుంచి దరఖాస్తులు ఆహ్వానం
- మీసేవకేంద్రంలో కూడా దరఖాస్తులు
విశాఖ రూరల్: రెవెన్యూ అధికారులకు కౌలు రైతులు ఇప్పటికి గుర్తొచ్చారు. ఖరీఫ్ ప్రారంభమయ్యాక రుణ అర్హత కార్డుల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. వర్షాభావ పరిస్థితుల్లో సైతం సాగుకు సిద్ధమై చాలా మంది ఇప్పటికే ప్రయివేటు ఫైనాన్షియర్ల నుంచి అధిక వడ్డీకి రుణాలు తీసుకున్నారు. ఇప్పుడు రుణ అర్హత కార్డుల మంజూరుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. మంగళవారం నుంచి ఈ నెల 21వ తేదీ వరకు నిర్ణీత తేదీల్లో గ్రామ సభలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.
రుణ అర్హత కార్డుల కోసం కౌలుదారులు నుంచి ఈ సభల్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మీసేవ కేంద్రాల్లో కూడా ఎప్పుడైనా దరఖాస్తు చేసుకొనే వెసులుబాటు కల్పించారు. 21వ తేదీ త రువాత దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారిని గుర్తిం చి రుణ అర్హుత కార్డులు మంజూరు చేయనున్నారు. ఈ ప్ర క్రియ మొత్తం పూర్తయ్యేందుకు నెల రోజులు పట్టనుంది. దీంతో అప్పటికే సాగు పనులు సగం పూర్తవుతాయి.
రుణాలు దక్కేనా..
ఖరీఫ్ ప్రారంభమైన నెల రోజుల తరువాత రుణ అర్హత కార్డులు ఇచ్చినా కౌలు రైతులకు ఒరిగేదేమి ఉండదని రైతు సంఘాలు మండిపడుతున్నాయి. పంటల సాగుకు ముందే రుణాలు పొందే అవకాశం కల్పిస్తేనా మేలు జరుగుతుందని పేర్కొంటున్నాయి. వచ్చే నెలలో కార్డులు ఇచ్చినా, బ్యాంకులు రుణాలు మంజూరు చేయడానికి మరింత జాప్యం జరుగుతుంది. గత ఏడాది రుణ అర్హుత కార్డులున్నా.. రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ఆసక్తి చూపించలేదు.
కార్డులు ఉన్నవారంద రికీ రుణాలు మంజూరు చేయాలని సాక్షాత్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినా బ్యాంకుర్లు మాత్రం ముందుకు రావడం లేదు. ఈ పరిస్థితుల్లో ఈ సీజన్లో సాగు ప్రారంభమయ్యాక ఎంతమందికి రుణాలు మంజూరు చేస్తారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీలైనంత వేగంగా కార్డులు ఇవ్వని పక్షంలో కౌలు రైతులు మేలు జరిగే అవకాశముండదు.
దరఖాస్తు చేసుకున్నవారికి కార్డులు
ఆంధ్రప్రదేశ్ భూమి సాగుదారుల చట్టం 2011 ప్రకారం అర్హులైన సాగుదారులకు రుణ అర్హత కార్డులు మంజూరు చేసేందుకు జిల్లాలో ఈ నెల 8 నుంచి 21వ వరకు గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ ప్రవీణ్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
దరఖాస్తు చేసుకున్న వారికి కార్డులు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. కార్డులున్న వారు పంట రుణాలు పొందవచ్చని వెల్లడించారు. రుణాల కోసమే కాకుండా తుపాను, కరువు సంభవించినప్పుడు పంట నష్ట పరిహారం మంజూరుకు ఉపయోగపడుతుందని వివరించారు. రుణ అర్హత కార్డులు వల్ల భూమి యజమాని హక్కులకు ఏ విధమైన అవరోధం ఉండదని, రైతులు సహకరించి అర్హులైన సాగుదారులందరికీ రుణ అర్హత కార్డుల మంజూరుకు తోడ్పడాలని సూచించారు.