Village houses
-
ఇప్పటికి కౌలు రైతులు గుర్తొచ్చారు
నేటి నుంచి 21 వరకు గ్రామ సభలు కౌలు రైతుల నుంచి దరఖాస్తులు ఆహ్వానం మీసేవకేంద్రంలో కూడా దరఖాస్తులు విశాఖ రూరల్: రెవెన్యూ అధికారులకు కౌలు రైతులు ఇప్పటికి గుర్తొచ్చారు. ఖరీఫ్ ప్రారంభమయ్యాక రుణ అర్హత కార్డుల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. వర్షాభావ పరిస్థితుల్లో సైతం సాగుకు సిద్ధమై చాలా మంది ఇప్పటికే ప్రయివేటు ఫైనాన్షియర్ల నుంచి అధిక వడ్డీకి రుణాలు తీసుకున్నారు. ఇప్పుడు రుణ అర్హత కార్డుల మంజూరుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. మంగళవారం నుంచి ఈ నెల 21వ తేదీ వరకు నిర్ణీత తేదీల్లో గ్రామ సభలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. రుణ అర్హత కార్డుల కోసం కౌలుదారులు నుంచి ఈ సభల్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మీసేవ కేంద్రాల్లో కూడా ఎప్పుడైనా దరఖాస్తు చేసుకొనే వెసులుబాటు కల్పించారు. 21వ తేదీ త రువాత దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారిని గుర్తిం చి రుణ అర్హుత కార్డులు మంజూరు చేయనున్నారు. ఈ ప్ర క్రియ మొత్తం పూర్తయ్యేందుకు నెల రోజులు పట్టనుంది. దీంతో అప్పటికే సాగు పనులు సగం పూర్తవుతాయి. రుణాలు దక్కేనా.. ఖరీఫ్ ప్రారంభమైన నెల రోజుల తరువాత రుణ అర్హత కార్డులు ఇచ్చినా కౌలు రైతులకు ఒరిగేదేమి ఉండదని రైతు సంఘాలు మండిపడుతున్నాయి. పంటల సాగుకు ముందే రుణాలు పొందే అవకాశం కల్పిస్తేనా మేలు జరుగుతుందని పేర్కొంటున్నాయి. వచ్చే నెలలో కార్డులు ఇచ్చినా, బ్యాంకులు రుణాలు మంజూరు చేయడానికి మరింత జాప్యం జరుగుతుంది. గత ఏడాది రుణ అర్హుత కార్డులున్నా.. రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ఆసక్తి చూపించలేదు. కార్డులు ఉన్నవారంద రికీ రుణాలు మంజూరు చేయాలని సాక్షాత్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినా బ్యాంకుర్లు మాత్రం ముందుకు రావడం లేదు. ఈ పరిస్థితుల్లో ఈ సీజన్లో సాగు ప్రారంభమయ్యాక ఎంతమందికి రుణాలు మంజూరు చేస్తారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీలైనంత వేగంగా కార్డులు ఇవ్వని పక్షంలో కౌలు రైతులు మేలు జరిగే అవకాశముండదు. దరఖాస్తు చేసుకున్నవారికి కార్డులు ఆంధ్రప్రదేశ్ భూమి సాగుదారుల చట్టం 2011 ప్రకారం అర్హులైన సాగుదారులకు రుణ అర్హత కార్డులు మంజూరు చేసేందుకు జిల్లాలో ఈ నెల 8 నుంచి 21వ వరకు గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ ప్రవీణ్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారికి కార్డులు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. కార్డులున్న వారు పంట రుణాలు పొందవచ్చని వెల్లడించారు. రుణాల కోసమే కాకుండా తుపాను, కరువు సంభవించినప్పుడు పంట నష్ట పరిహారం మంజూరుకు ఉపయోగపడుతుందని వివరించారు. రుణ అర్హత కార్డులు వల్ల భూమి యజమాని హక్కులకు ఏ విధమైన అవరోధం ఉండదని, రైతులు సహకరించి అర్హులైన సాగుదారులందరికీ రుణ అర్హత కార్డుల మంజూరుకు తోడ్పడాలని సూచించారు. -
వినూత్నం వెలవెల
నెల్లూరు(టౌన్), న్యూస్లైన్: ‘రాష్ట్రంలో తొలిసారిగా వినూత్న తరహాలో జిల్లాలో గ్రామసభలు నిర్వహిస్తున్నాం. ఈ సభలో ఓటింగ్ ఉన్న వారు మాత్రమే పాల్గొనాలి. ప్రజలకు సంబంధించిన ప్రతి విషయంపై చర్చ జరగాలి. మెజార్టీ ప్రజలు చేతులెత్తి ఆమోదం తెలిపితేనే అభివృద్ధి పనులు మంజూరు చేస్తాం. ఇవన్నీ రికార్డు చేస్తాం. వీడియో, ఫొటోలు కూడా తీస్తాం. ఈ గ్రామ సభలకు మండల స్థాయిలోని ప్రతి శాఖకు చెందిన అధికారి హాజరు కావాలి’ ఈ మాటలన్నది ఎవరో కాదు సాక్షాత్తు మన జిల్లా పరిపాలనకు కేంద్రబిందువైన కలెక్టర్ శ్రీకాంత్. అయితే కేవలం రెండు రోజులకే ఇదంతా ఆర్భాటమే అని తేలిపోయింది. ఆచరణలో హుళక్కే.. జిల్లాలో శనివారం 152 చోట్ల గ్రామసభలను అధికారులు నిర్వహించారు. అన్నింటిలో జనాల హాజరు అతి తక్కువగా ఉండటంతో గ్రామసభలు వెలవెల బోతున్నాయి. సూళ్లూరుపేట మండలంలో కేవలం ఎంపీడీఓ మాత్రమే హాజరయ్యారు. చాలా సేపటి వరకు ఆయన ప్రజల కోసం వేచి ఉండాల్సి వచ్చింది. తర్వాత అతి తక్కువగా ప్రజలు హాజరయ్యారు. 17 శాఖలకు గాను నలుగురైదుగురు అధికారులు కూడా హాజరుకాకపోవడం గమనార్హం. చిల్లకూరు మండలం చింతవరం అనే గ్రామంలో 1200 వరకు ఓట్లు ఉన్నాయి. మొదట్లో 20 మంది మాత్రమే హాజరయ్యారు. మళ్లీ ప్రజలను బతిమాలడంతో మరో 20 మంది వరకు వచ్చారు. వాకాడు మండలంలోని కాశీపురంలో జరిగిన గ్రామసభకు మొదటగా వచ్చిన వ్యవసాయ విస్తరణాధికారి గంటల కొద్ది ఎదురు చూడాల్సి వచ్చింది. తర్వాత ఎంపీడీవో చొరవతో 50 మంది సభకు హాజరయ్యారు. పలుచోట్ల అధికారులు హాజరు కాలేదు. పెళ్లకూరు మండలం కొత్తూరులో సభ జరగకుండా పెత్తందారులైన స్థానిక టీడీపీ, కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. దళిత సర్పంచ్ తడగల బుజ్జమ్మ గ్రామ సభను నడపడమే వారి దృష్టిలో తప్పైంది. దీంతో ఇక్కడ గ్రామ సభను కొంతసేపు స్థానికులు బహిష్కరించారు. సమన్వయ లోపం గ్రామసభలకు అధికారులందరూ హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. అయితే ఒకే రోజు ఐదారు గ్రామాల్లో సభలు నిర్వహిస్తుండటంతో అధికారులు అన్ని ప్రాంతాలకు వెళ్లలేక పోతున్నారు. ఒక గ్రామ సభ జరిగే సమయంలో మరో గ్రామ సభ జరగకుండా జాగ్రత్తలు తీసుకోగలిగితే అధికారులందరూ ప్రతి సభకు హాజరై సభలో తమ శాఖలకు చెందిన విషయాలను ప్రజల ముందించి వారి ఆమోదం పొందవచ్చు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమయపాలనతో పాటు , రాజకీయాలు లేకుండా చూడాలని, సభలో పాల్గొన ని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.